అరెస్టులతో ఉద్యమాలు ఆగవు : గొర్ల కాపరులు

అరెస్టులతో ఉద్యమాలు ఆగవు : గొర్ల కాపరులు

యాదాద్రి భువనగిరి : గొర్ల కాపరులను అరెస్ట్ చేశారు భువనగిరి రూరల్ పోలీసులు. రెండో విడత గొర్రెలు పంపిణీ చేయాలని బుధవారం  ఛలో అసెంబ్లీ ముట్టడికి బయలుదేరారు బస్వాపురం  గ్రామ గొర్రెల కాపరులు. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు వారిని భువనగిరిలో అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా జీఎంపీఎస్ జిల్లా కార్యదర్శి దయ్యాల నర్సింహ మాట్లాడుతూ..గొర్రెల పంపిణీ చేయకపోవడంతో కాపరులు ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. అరెస్టులతో ఉద్యమాలు ఆగవన్నారు.