కేసీఆర్ హోల్ సెల్ గా.. ఎమ్మెల్యేలు రిటేల్ గా దోచుకుంటున్నరు…

కేసీఆర్ హోల్ సెల్ గా.. ఎమ్మెల్యేలు రిటేల్ గా దోచుకుంటున్నరు…

నిజామాబాద్ లో జరుగుతున్న ఆర్టీసీ దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు బీజేపీ నాయకులు, ఎంపీ అరవింద్. ఆర్టీసీ భూములు అమ్ముకుందామని సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ హోల్ సేల్ గా ఎమ్మెల్యేలు రిటేల్ గా దోపిడీ చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ తన కుటుంబం మీద చూపించే ప్రేమలో ఐదు శాతమైనా ఆర్టీసీ మీద చూపించాలని కోరారు.  ఆర్టీసీ కార్మికుల బలి దానాలకు సీఎం కేసీఆర్ అహంకార ప్రకటనలే కారణమని అన్నారు. ఆర్టీసీ భయంతోనే మున్సిపల్ ఎన్నికలు పెట్టడం లేదని చెప్పారు.

కేసీఆర్ గద్దె దిగే రోజు దెగ్గరలోనే ఉందని అరవింద్ అన్నారు.  ఎన్ని రోజులు నియతృత్వ పాలన నడిపిస్తడో చూద్దామని చెప్పారు. కేసీఆర్ జైలుకు పోయే రోజు దగ్గర్లోనే ఉందని, ఇప్పటికే ఆయన విపరీత పాపాలు చేశారని అన్నారు. ఆర్టీసీ కార్మికులు ధైర్యంగా ఉండండని.. మీరు విజయం సాధించే రోజు దూరంలో లేదని అన్నారు.