కేసీఆర్ చరిత్ర ఆయన ముందే చెరిగిపోతోంది

కేసీఆర్ చరిత్ర ఆయన ముందే చెరిగిపోతోంది

నిర్మల్: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్మల్‌లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో కేంద్ర మంత్రులు అమిత్ షా, కిషన్ రెడ్డితోపాటు రాష్ట్ర బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ సభలో ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ.. తెలంగాణ నేల అంటేనే పౌరుషాల గడ్డ అన్నారు. ఇలాంటి పోరాటాల గడ్డపై కేసీఆర్ నిర్బంధపు పాలన చేద్దామనుకుంటున్నారని చెప్పారు. అయితే నిర్బంధాలకు భయపడే నేల ఇది కాదన్నారు. రామదాసును గోలకొండలోని జైలులో ఖైదీ చేస్తే భక్త రామదాసుగా చరిత్రలో నిలబడిపోయారని చెప్పారు. కానీ భయపడలేదన్నారు. అలాగే కవి దాశరథిని నిజామాబాద్ ఖిల్లా జైలులో బందీ చేస్తే మహాకవి దాశరథిగా.. తెలంగాణను కోటి రతనాల వీణగా మారుమోగించారని పేర్కొన్నారు. కేసీఆర్ చరిత్ర ఆయన ముందే చెరిగిపోతోందన్నారు. తెలంగాణ విమోచన దినంలో పాల్గొనడానికి అమిత్ షా ఇక్కడకు రావడం చాలా మంచి విషయమన్నారు.