కిషన్ రెడ్డి నాయకత్వంలో అధికారంలోకి వస్తాం: ఎంపీ అర్వింద్

కిషన్ రెడ్డి నాయకత్వంలో అధికారంలోకి వస్తాం: ఎంపీ అర్వింద్

కిషన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో సింగిల్ గానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. కిషన్ రెడ్డి నాయకత్వంలో అందరం కలిసి పనిచేస్తామన్నారు. ఆయన నాయకత్వంలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.  

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి, ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ గా ఈటల రాజేందర్ నియామకంపై  హర్షం వ్యక్తం చేసిన అర్వింద్.. వారికి విషెస్ చెప్పారు. బండి సంజయ్ పార్టీ కోసం చాలా కష్టపడ్డారని చెప్పారు. ఆయన అధ్యక్షుడిగా పార్టీలో మంచి విజయాలు సాధించామని అన్నారు.  బండి సంజయ్ అగ్రెసివ్ గా అధికార పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేశారని తెలిపారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా బీజేపీ హైకమాండ్ తెలంగాణ అధ్యక్షుడిగా కిషన్ న్ రెడ్డిని, ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ గా ఈటల రాజేందర్ ను నియమించింది.