యూటీగా హైదరాబాద్!?

యూటీగా హైదరాబాద్!?
  • ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయి
  • లోక్ సభలో అసదుద్దీన్ ఒవైసీ

ఢిల్లీ : హైదరాబాద్, బెంగళూరు, చెన్నయ్, ముంబై కేంద్ర పాలిత ప్రాంతాలు ఎంతో దూరంలో లేవని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసుదుదీన్ ఒవైసీ అన్నారు. ఢిల్లీ బిల్లుపై లోక్ సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. పార్లమెంటు వేదికగా అన్ని ప్రాంతీయ పార్టీలకు తాను హెచ్చరిస్తున్నట్టు చెప్పారు. రాజ్యాంగ విరుద్ధమైన ఈ బిల్లును ఎంఐఎం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని చెప్పారు. ఢిల్లీకి సంపూర్ణ రాష్ట్రహోదా కోసం కల్పిస్తూ అప్పటి ప్రధాని దివంగత వాజ్‌పేయీ ఈ సభలో బిల్లును ప్రవేశపెట్టారని అసద్ గుర్తు చేశారు. కేజ్రీవాల్‌ కేంద్ర ప్రభుత్వంలోని పెద్దల థింక్‌ట్యాంక్‌ నుంచే బయటకు వచ్చారని అన్నారు. ఆయన కేంద్ర ప్రభుత్వ మనిషేనని, మీరు అధికారంలో లేనప్పుడు ఆయనను ఆ స్థానంలో ఉంచాలనుకుంటున్నారని విమర్శించారు.