సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వమే సమస్యలు సృష్టిస్తోంది

సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వమే సమస్యలు సృష్టిస్తోంది

తెలంగాణ వచ్చిన తర్వాత కూడా పోడు భూముల కోసం పోరాడాల్సిన పరిస్థితి రావడం సిగ్గు చేటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో జాటోతు తనూ నాయక్ వర్ధంతి సందర్భంగా ఆయన ఫోటోకు సంజయ్  నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రజాకార్లపై తనూ నాయక్ పోరాటం అందరికీ స్ఫూర్తినిస్తుందన్నారు. కేసీఆర్ పాలన రజాకార్ల పాలనను మరిపిస్తుందని సంజయ్ అన్నారు. కేసీఆర్ సర్కార్‌కు ఎన్నికలప్పుడు మాత్రమే పోడు భూముల సమస్య గుర్తుకు వస్తుందని ఆయన విమర్శించారు. సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వమే సమస్యలు సృష్టిస్తుందని ఆయన ఆరోపించారు. పట్టణాల్లో టీఆర్ఎస్ నాయకులు భూ కబ్జాలు చేస్తున్నారని సంజయ్ అన్నారు. పేద లంబాడీల కోసం బీజేపీ పోరాడుతుందని సంజయ్ అన్నారు.