- తామేమి చేయలేమన్న సిబ్బంది
పెద్దపల్లి, వెలుగు: నామినేషన్ వేయడానికి కలెక్టరేట్కు వచ్చిన ఓ అభ్యర్థి టైం అయిపోవడంతో గేటు వద్ద సిబ్బందిని ప్రాధేయపడాల్సి వచ్చింది. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి దళిత బహుజన పార్టీ తరఫున పోటీ చేయాలనుకున్న మాతంగి హనుమయ్య గురువారం కలెక్టరేట్కువచ్చారు. ఉద యం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకే నామినేషన్లు తీసుకునే టైం కావడంతో, ఆయన ఆలస్యంగా వచ్చారు.
దీంతో మెయిన్ గేట్లు మూసివేయడంతో అక్కడున్న పోలీసులు, ఇతర సిబ్బందిని బతిమిలాడుకున్నారు. ‘ఎలాగైనా ఎన్నికల్లో నిలబడాలనే కోరికతో ఉన్నా.. మీ కాల్మొక్తా ఒక్కసారి గేటు తీయండి. నా పత్రాలు కలెక్టర్కు ఇస్తా’ అని వారి కాళ్లు మొక్కబోయారు. తామేమీ చేయలేమని చెప్పడంతో హనుమయ్య ఆవేదనతో వెళ్లిపోయాడు.