కరీంనగర్ జిల్లా: హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం పేక మేడలాగా కూలిపోతుందన్నారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. ఆదివారం ఆయన జమ్మికుంటలో మాట్లాడుతూ.. కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందన్నారు. కేసీఆర్ కు దమ్ముంటే కేటీఆర్ ను తీసుకొచ్చి హుజురాబాద్ లో నిలబెట్టాలన్నారు. పైసలు తీసుకున్న టీఆర్ ఎస్ నాయకులు ఈటలకు టచ్ లో ఉన్నారని.. కేసీఆర్ ఓ బెవకూఫ్ అన్నారు. హుజురాబాద్ ఎన్నిక కోసం కేసీఆర్ మూడు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని.. కర్మ కాలి టీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే అధికారులు బానిసలు అవుతారని తెలిపారు. దళితులను కేసీఆర్ అవమానించినంతగా ఇంకా ఎవరూ అవమానించలేదన్నారు. కేసీఆర్ కుటుంబంలో నలుగురు ముఖ్యమంత్రులు ఉన్నారని.. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అంటుండన్నారు. తెలంగాణలో ఫ్యాక్టరీలు ఎందుకు అమ్ముతున్నవని కేసీఆర్ పై అరవింద్ విమర్శలు గుప్పించారు.