భార్యను దేవతకు బలిచ్చి.. పూజగదిలో పాతిపెట్టిన భర్త

భార్యను దేవతకు బలిచ్చి.. పూజగదిలో పాతిపెట్టిన భర్త

దేశంలో మేధస్పు కొత్త పుంతలు తొక్కుతుంటే.. మరోపక్క కొంతమంది మూఢనమ్మకాల పేరుతో ఇంకా నరబలులను ఇస్తూనే ఉన్నారు. మూఢనమ్మకంతో మధ్యప్రదేశ్‌కి చెందిన ఓ వ్యక్తి తన భార్యను నరికి చంపాడు. సింగ్రౌలి జిల్లాలోని బసౌడా గ్రామానికి చెందిన ఓ 50 సంవత్సరాల వ్యక్తికి భక్తి ఎక్కువ. ఆ భక్తితో మూఢనమ్మకాలను ఎక్కువగా నమ్మేవాడు. దేవతలను ప్రసన్నం చేసుకోవాలని.. తరచుగా ఇంట్లో జంతువులను బలి ఇచ్చేవాడు. అది కాస్తా ముదిరి.. ఈసారి ఏకంగా భార్యనే బలి ఇవ్వాలని అనుకున్నాడు.

బుధవారం రాత్రి నిద్రిస్తున్నతన భార్యను కత్తితో నరికి చంపాడు. ఆ తర్వాత ఆమె తలను, మొండెం నుంచి వేరుచేసి పూజ గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ దేవత ముందు ఉంచి కాసేపు పూజలు నిర్వహించాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని అదే పూజగదిలో పాతిపెట్టి పారిపోయాడు.

గురువారం ఉదయం నిద్రలేచిన వారి కుమారులు.. తల్లి కోసం వెతకగా.. పూజ గదిలో తవ్విన ఆనవాళ్లు కనిపించాయి. అక్కడ తమ తల్లి శవాన్ని చూసి షాక్ అయ్యారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టానికి పంపించారు.

తమ తండ్రి ఒక దేవతను సంతోషపెట్టాలన్న కోరికతోనే తమ తల్లిని హత్య చేశాడని పోలీసులకు తెలిపారు. నిందితుడు కొన్ని రోజుల క్రితం ఒక మేకను కూడా చంపి.. దాని మృతదేహాన్ని పూజ గదిలో పాతిపెట్టి పూజలు చేశాడని వాళ్ళు తెలిపారు. కేసు నమోదు చేసి.. నిందితుడి కోసం గాలింపు చేపట్టి గురువారం అరెస్టు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) ప్రదీప్ షెండే తెలిపారు.

For More News..

సుశాంత్ కేసులో తొలిసారి స్పందించిన లేడీ అమితాబ్

కవలపిల్లలకు విషం పట్టించిన తండ్రి.. విషం కొన్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డు

ఒకే జిల్లాలో వరుస అత్యాచారాలు.. 20 రోజుల్లో ముగ్గురు మైనర్లపై..