తెలంగాణలో MPTC, ZPTC ఎన్నికల ఓట్ల లెక్కింపునకు తేదీ ఖరారైంది. జూన్ 4న ఓట్లు లెక్కించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) నిర్ణయించింది. రాష్ట్రంలోని మండల, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలకు మే 6, 10, 14 తేదీల్లో మొత్తం మూడు విడతల్లో జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఓట్లను జూన్ 4న ఉదయం 8గంటల నుంచి లెక్కించనున్నారు.
జూన్ 4 కంటే ముందే లెక్కింపు చేపట్టాలని భావించినప్పటికీ.. నల్గొండ, వరంగల్, రంగారెడ్డి శాసనమండలి ఎన్నిక ఈ నెల 31న జరగనుంది. ఆ ఓట్ల లెక్కింపు జూన్ 3న ఉండటంతో అవి ముగిసిన వెంటనే పరిషత్ ఓట్ల లెక్కింపు చేపట్టాలని నిర్ణయించారు. అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 123 లెక్కింపు కేంద్రాల్లో 978 లెక్కింపు హాళ్లలో ఈ లెక్కింపు ప్రక్రియి కొనసాగుతుంది. 34వేల మంది సిబ్బంది ఈ ప్రక్రియలో పాల్గొంటారు.