
పరిషత్ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 8 గంటల నుంచి 5 గంటల వరకు కౌంటింగ్ జరుగుతుంది. అయితే మధ్యాహ్నానికి ట్రెండ్స్ తెలిసిపోతాయి. 2వేల 426 మంది జెడ్పీటీసీ అభ్యర్థులు, 18వేల 930 మంది ఎంపీటీసీ అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. పరిషత్ ఓట్ల లెక్కింపుకు 123 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొదటగా ఎంపీటీసీ, తర్వాత జెడ్పీటీసీల ఓట్లు లెక్కిస్తారు. లెక్కింపు కేంద్రాల దగ్గర భారీ ఏర్పాట్లు చేశారు పోలీసులు. 144 సెక్షన్ అమలు ఇంప్లీమెంట్ చేస్తున్నారు. 35వేల మంది సిబ్బంది. .లెక్కింపు విధుల్లో పాల్గొంటారు.