దళితుల భూములు లాక్కుంటున్నారని… ఎమ్మార్పీఎస్ ధర్నా

దళితుల భూములు లాక్కుంటున్నారని… ఎమ్మార్పీఎస్ ధర్నా

రంగారెడ్డి జిల్లా: ఆమనగల్ లోని ఎమ్మార్వో కార్యాలయం ఎదుట పేద ఎస్సీ, ఎస్టీ లబ్దిదారులు ఆందోళనకు దిగారు. తాము సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూములను ప్రకృతి వనాల పేరిట ప్రభుత్వం లాక్కుంటోందని ఆరోపిస్తూ వారు నిరసన చేపట్టారు. అధికారుల చర్యలను వ్యతిరేకిస్తూ.. ఆమనగల్ లోని ఎమ్మార్వో కార్యాలయం ముందు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు ప్రారంభించారు. దీక్ష శిబిరానికి mrps వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ  హాజరై సంఘీభావం తెలిపారు.