ముదిరాజ్​లకు మంత్రి పదవి ఇవ్వాలి

ముదిరాజ్​లకు మంత్రి పదవి ఇవ్వాలి

  ఖైరతాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత  మంత్రి వర్గంలో ముదిరాజ్​లకు రెండుసార్లు స్థానం కల్పించారని.. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ముదిరాజ్​లకు మంత్రి వర్గంలో చోటు కల్పించాలని తెలంగాణ ముదిరాజ్​మహాసభ సీఎం రేవంత్​రెడ్డికి విజ్ఞప్తి చేసింది.

 బుధవారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో జరిగిన మీడియా సమావేశంలో సంఘం రాష్ట్ర కన్వీనర్​ డాక్టర్​గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్ ​మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో బీఆర్ఎస్​ పార్టీ ముదిరాజ్​లకు సీట్లు కేటాయించకపోవడంతో కాంగ్రెస్ ​పార్టీకి మద్దతు పలికామన్నారు. కొత్తగా చట్టసభలకు ఎన్నికైన వారిని సత్కరించేందుకు ఈ నెల 24న ఆదివారం ఖైరతాబాద్​లోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్​లో ముదిరాజ్​మేధో మదన సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. యువత పాల్గొవాలని కోరారు.