ములాయంసింగ్ యాదవ్కు కొనసాగుతున్న చికిత్స

ములాయంసింగ్ యాదవ్కు కొనసాగుతున్న చికిత్స

యూపి మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కు సీసీయూలో చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతానికి ఆయన పరిస్థితి సీరియస్ గా ఉందని మేదాంత హాస్పిటల్ వైద్యులు చెప్పారు. ములాయంకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు ప్రకటించారు. వైద్యుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.
 

ములాయం సింగ్ ఆరోగ్యం అనారోగ్యం పాలవడంతో కుటుంబసభ్యులు ఆయనను మేదాంత హాస్పిటల్ కు తరలించారు. అక్కడ తొలుత ప్రైవేట్ వార్డులో చికిత్స అందించగా.. ఆక్సిజన్ స్థాయిలు తగ్గడంతో వెంటనే ఐసీయూకు షిఫ్ట్ చేశారు. ఆదివారం పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారడంతో క్రిటికల్ కేర్ యూనిట్ కు తరలించి వైద్యం అందిస్తున్నారు.