
పాలమూరు, వెలుగు : ఎస్కార్ట్లో అతి రక్షణ వల్లే పొరపాట్లు జరుగుతున్నాయని మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణ చెప్పారు. అలంపూర్ నియోజకవర్గంలో ఇథనాల్ కంపెనీ వద్ద జరిగిన ఆందోళనలో పాల్గొన్న రైతులకు ఎస్కార్ట్ పోలీసులు అతి రక్షణ కల్పించడం వల్లే పొరపాట్లు జరిగాయన్నారు. శుక్రవారం మహబూబ్నగర్ ఎస్పీ ఆఫీస్లో ఉమ్మడి జిల్లా ఎస్పీలతో పోలీస్ ఎస్కార్ట్పై నిర్వహించిన రివ్యూలో ఆయన మాట్లాడారు.
రిమాండ్లో ఉన్న నిందితులు, శిక్షలు పడిన ఖైదీలను జైలు, కోర్టు, హాస్పిటల్స్కు తరలించే సమయాల్లో తగిన భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. ఎస్కార్ట్ డ్యూటీల్లో పాల్గొనే పోలీసులు ఖైదీల పూర్వ చరిత్ర, జైలులో వారి ప్రవర్తనను ముందుగానే తెలుసుకుని అలర్ట్గా ఉండాలన్నారు. వాస్తవిక పరిస్థితుల ఆధారంగా ప్రతి ఖైదీకి రిస్క్ ప్రొఫైల్ రూపొందించి, అతడిపై ఎలా పర్యవేక్షణ కొనసాగించాలన్న విషయంపై వివరణాత్మక వ్యూహం రూపొందించుకోవాలని సూచించారు. సమావేశంలో జోగులాంబ జోన్ డీఐజీ చౌహన్, ఎస్పీలు డి.జానకి, వైభవ్ గైక్వాడ్, రావుల గిరిధర్, తోట శ్రీనివాస్రావు, యోగేశ్ గౌతమ్ పాల్గొన్నారు.