కర్నాటక రాజకీయం: శివకుమార్ ను అడ్డుకున్న పోలీసులు

కర్నాటక రాజకీయం: శివకుమార్ ను అడ్డుకున్న పోలీసులు

కర్ణాటక రాజకీయం మరో మలుపు తిరిగింది. కాంగ్రెస్‌ నేత, మంత్రి డీకే శివకుమార్‌ ముంబైకి వెళ్లారు. 13 మంది ఎమ్మెల్యేల ను బుజ్జగించేందుకు ఆయన అక్కడికి వెళ్లారు. ఆయనతో పాటు జేడీఎస్‌ ఎమ్మెల్యే శివలింగ గౌడ కూడా వెళ్లారు. ముంబైలోని హోటల్‌లో ఉంటున్న నేతలతో వీరిద్దరూ సమావేశం కానున్నారు. వీరిద్దరూ అక్కడికి చేరుకోవడంతో అసమ్మతి నేతలున్న హోటల్‌ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే భద్రతా పరమైన చర్యల దృష్ట్యా శివకుమార్‌ను అనుమంతించబోమని పోలీసులు స్పష్టం చేశారు. తమ సన్నిహితులను కలిసేందుకే ముంబై వచ్చానని చెప్పినా… హోటల్ లోకి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకోవడం కుట్ర అన్నారు డీకే. రాజకీయాల్లో కలిసి పుట్టామని, కలిసే చనిపోతామన్నారు. ప్రస్తుత సమస్య…చిన్నదన్న డీకే.. త్వరలోనే దానికి పరిష్కారం దొరుకుతుందన్నారు శివకుమార్.