మున్సిపాలిటీ అద్దె షాప్​లు సీజ్

మున్సిపాలిటీ అద్దె షాప్​లు సీజ్

జోగిపేట, వెలుగు : సంగారెడ్డి జిల్లా ఆందోల్ -జోగిపేట పురపాలక సంఘానికి చెందిన అద్దె షాపులను మున్సిపల్ అధికారులు గురువారం సీజ్​చేశారు. గాంధీ పార్క్ షాపింగ్ కాంప్లెక్స్ లోని దుకాణ సముదాయంలో కొంతమంది షాపుల అద్దె చెల్లించకపోవడం వల్ల 4 షాప్​లు సీజ్​ చేశారు.

బకాయి చెల్లించే విషయంలో ఇది వరకే  పలుమార్లు నోటీసు ఇచ్చినప్పటికీ అద్దె చెల్లించడంలేదని ఇన్‌చార్జి రెవెన్యూ ఇన్స్​పెక్టర్​నారాయణ చెప్పారు. మొండి బకాయిలు ఉన్న షాప్​లను 2019 పురపాలక చట్టం, రెవెన్యూ రికవరీ యాక్ట్​  ప్రకారం సీజ్ చేసినట్లు తెలిపారు.