ఈ మహిళ సెప్టిక్ ట్యాంకర్ ​ఆపరేటర్

ఈ మహిళ సెప్టిక్ ట్యాంకర్ ​ఆపరేటర్

దేశంలోనే రెండో మహిళ

వరంగల్​ అర్బన్, వెలుగు:  దేశంలోనే  రెండో సెప్టిక్ ట్యాంకర్ ఆపరేటర్​గా  ఓ మహిళను నియమించి ఈ మేరకు గ్రేటర్​ కార్పొరేషన్​ లైసెన్స్ జారీ చేసింది.  పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్​లోని  నర్సాపూర్ ​మహిళ తొలి ఆపరేటర్​గా అవకాశం పొందగా రెండో మహిళగా వరంగల్​ అర్బన్​ జిల్లా హసన్​పర్తికి చెందిన దాసరి శ్రావణి నిలిచారు. ఈ మేరకు గ్రేటర్​ కార్పొరేషన్​ గెస్ట్​హౌజ్​లో శ్రావణికి హెల్త్​ ఆఫీసర్ ​డాక్టర్ ​రాజారెడ్డి మంగళవారం లైసెన్స్అం దజేశారు.

శానిటేషన్​లో మహిళలకు అవకాశం

శానిటేషన్​ రంగంలో ఇప్పటికే ప్రధాన పాత్ర పోషిస్తున్న మహిళలకు సెప్టిక్​ట్యాంకర్ల నిర్వహణలో భాగస్వామ్యం కల్పించేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఆస్కీ సహకారంతో గ్రేటర్​ కార్పొరేషన్​ ఆధ్వర్యంలో అమ్మవారిపేటలో మానవ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్​ ఏర్పాటు చేసి అందరి ప్రశంసలు పొందింది. ఈ ట్యాంక్​ నిర్వహణ విజయవంతంగా కొనసాగిస్తూ పర్యావరణ పరిరక్షణతో పాటు మానవ వ్యర్థాలకు సరైన పరిష్కారం చూపెట్టారు. తాజాగా సెప్టిక్​ట్యాంక్​ ఆపరేటర్​గా ఓ మహిళకు అవకాశం కల్పించడం పట్ల ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. కార్పొరేషన్ పక్షాన ఇంతకుముందు 14 మంది పురుషులకు సెప్టిక్ ట్యాంకర్​ ఆపరేటర్లుగా లైసెన్స్ లు అందజేశారు. ప్రస్తుతం ఆపరేటర్ గా లైసెన్స్ అందజేసిన దాసరి శ్రావణి కి  పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్ మెంట్(పీపీఈ)ల వినియోగంతో పాటు మలాన్ని సేకరించే క్రమంలో అనుసరించే విధానాలు, ఏ విధంగా రవాణా చేయాలి వంటి విషయాలతోపాటు ఆపరేటర్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో శిక్షణ ఇచ్చారు. పురుషులు చేసే పనిలో తానూ పోటీపడాలని భావించానని, ఉపాధి కోసం ఈ పని ఎంచుకున్నానని శ్రావణి తెలిపారు.

అవకాశం కల్పిస్తాం

సెప్టిక్​ ట్యాంకర్​ఆపరేటర్లుగా చేయడానికి ఆసక్తి ఉన్న మహిళలు ముందుకు వస్తే బల్దియా తరఫున వారిని ప్రోత్సహిస్తాం. వారికి ప్రత్యేక శిక్షణ నిచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. – డాక్టర్​ రాజారెడ్డి, గ్రేటర్​మున్సిపల్ ​హెల్త్​ఆఫీసర్​