ఒక్కొక్కరికి 500.. బిర్యానీ

ఒక్కొక్కరికి 500.. బిర్యానీ

వరంగల్‍ రూరల్‍, వెలుగు: వరంగల్ లో ప్రచారానికి వచ్చినోళ్లకు టీఆర్ఎస్ భారీగా ఆఫర్లు ఇస్తోంది. రూ.500, బిర్యానీ పంపిణీ చేయడంతో పాటు బైకులో పెట్రోల్ పోయిస్తోంది. ఆదివారం నగరంలోని 29వ డివిజన్ లో చేపట్టిన బైకు ర్యాలీకి టీఆర్ఎస్ అభ్యర్థి గుండు సుధారాణి రూ.లక్షల్లో ఖర్చు చేశారు. ప్రచారానికి వచ్చిన వెయ్యి మందికి ఆమె అనుచరులు రూ.500 చొప్పున పంచిపెట్టారు. ఇందుకు నగరంలోని సుశీల్ సినిమా టాకీస్ ను అడ్డాగా చేసుకున్నారు. టాకీస్ గేట్లు వేసి, ఒక్కో బైక్ ను బయటకు వదులుతూ రూ.500 చేతిలో పెట్టారు. తానే మేయర్ అభ్యర్థినని చెప్పుకుంటున్న సుధారాణి.. తన  కోడలు, మాజీ కార్పొరేటర్ అశ్రితారెడ్డి పోటీ చేసిన 29వ డివిజన్ నుంచి బరిలో ఉన్నారు. కాగా, ఒక్కో అభ్యర్థి ప్రచార ఖర్చు ఎట్టి పరిస్థితుల్లోనూ రూ.1.5 లక్షలు దాటొద్దనే నిబంధన ఉన్నప్పటికీ.. సుధారాణి ఒక్కరోజే అంతకంటే ఎక్కువ ఖర్చు చేసినా జిల్లా అధికారులకు మాత్రం  కనిపించడం లేదు.