
లోక్ సభ స్పీకర్గా ఎన్నికైన్ ఓం బిర్లాకు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. గురువారం ఉభయ(రాజ్య సభ, లోక్ సభ) సభలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. రాష్ట్రపతి భవన్ నుంచి పార్లమెంట్ కు చేరుకున్న దేశ ప్రథమ పౌరురాలికి ప్రధాన మంద్రి మోదీ, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ కర్, పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్వాగతం పలికారు.
అనంతరం రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడారు. మూడో సారి ఏర్పడ్డ ఎన్డీయే ప్రభుత్వ కార్యక్రమాలు, విధానాల గురించి రాష్ట్రపతి ప్రసంగంలో వివరించారు. కొత్తగా కొలువుదీరిన లోక్ సభ సభ్యులకు శుభాకంక్షలు తెలిపి, దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని వారిని కోరారు. ఈ సారి భారత్ లో జరిగిన ఎన్నికలు ఎంతో ప్రత్యేకమైనవని.. వాటి గురించి ప్రపంచమంతా చర్చించుకుంటుందని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశంలో ఎన్నికలు సజావుగా నిర్వహించినందుకు ఎలక్షన్ కమిషన్ ను అభినందించారు.
ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుందని, ప్రజల ఆకాంక్ష మేరకు త్వరలో పూర్తి బడ్జెట్ చట్టసభల్లో ప్రవేశపెడతామని రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము తెలిపారు. కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు పంటరుణాలు ఇస్తున్నామని, ఆర్గానిక్ ఉత్పత్తులు పెరిగాయని పభుత్వ పథకాలను కొనయాడారు. వ్యాపారాన్ని సులభతరం చేయడం వల్ల పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయని, వ్యవసాయ రంగంలో ఉపాధి పెరిగిందని రాష్ట్రపతి వివరించారు. గడిచిన 10ఏళ్ల నుంచి ఐటీ నుంచి టూరిజం వరకు అన్నీ రంగాల్లో భారత్ దూసుకెళ్తోందని రాష్ట్రపతి అన్నారు. రక్షణ, బ్యాకింగ్ రంగాల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చాము. యువతకు ఉపాధి కల్పించడంలో మా ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్రపతి వెల్లడించారు.