రాహుల్ గాంధీకి పోస్ట్కార్డులు ..కొనసాగుతున్న మధురిడ్జ్ అపార్ట్మెంట్ వాసుల ఆందోళన

రాహుల్ గాంధీకి పోస్ట్కార్డులు ..కొనసాగుతున్న మధురిడ్జ్ అపార్ట్మెంట్ వాసుల ఆందోళన

హైదరాబాద్​సిటీ, వెలుగు: మూసీ సుందరీకరణ, గాంధీ సరోవర్​పేరుతో తమ ఇండ్లను కూల్చవద్దంటూ మధుపార్క్​రిడ్జ్​ వాసులు చేస్తున్న ఆందోళన కొనసాగుతోంది. ఆదివారం ఇక్కడ నిర్వహించిన సమావేశానికి సాయిరామ్​నగర్​, గంధంగూడ, హైదర్షా కోట్​వాసులు పాల్గొని సంఘీభావం తెలిపారు. సామాజిక కార్యకర్తలు సజయ, జీవన్ కుమార్, సీనియర్​ జర్నలిస్టు కె. శ్రీనివాస్, తులసీ చందు, విద్యావేత్త ఘంటా చక్రపాణి హాజరయ్యారు.

ఈ సందర్భంగా కొందరు మాజీ సైనికులు కూడా కలిసి సంఘీభావం తెలిపారు. వందల మంది పిల్లలు ప్లకార్డులను ప్రదర్శిస్తూ తమ ఇండ్లను కూల్చవద్దన్నారు. తమ ఇండ్లను కాపాడాలని రాహుల్​గాంధీకి పోస్ట్​కార్డులు పంపనున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా వాళ్లు రాసిన కార్డులను ప్రదర్శించారు. మూసీ జన ఆందోళన్, హ్యూమన్​ రైట్స్​ ఫోరం, సేవ్​మూసీ మూవ్​మెంట్, ఫ్రైడేస్​ఫర్​ ఫ్యూచర్, క్లైమేట్​ఫ్రంట్​తెలంగాణ వంటి ప్రజా సంఘాలు మూసీ అభివృద్ధి ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ నిర్వాసితులకు సంఘీభావం తెలిపాయి.