‘పుష్ప’ చిత్రంతో నేషనల్ అవార్డు దక్కించుకుని పాన్ ఇండియా రేంజ్లో పాపులారిటీ తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. ప్రస్తుతం ‘పుష్ప ద రూల్’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు బన్నీ. సుకుమార్ దర్శకత్వంలో శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ మూవీపై రోజురోజుకీ ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి.
రీసెంట్గా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు షేర్ చేయడంతో అంచనాలకు మించేలా ఈ చిత్రం రూపొందుతోందని తెలుస్తోంది. ‘పుష్ప2’లో బన్నీ అందర్నీ ఆశ్చర్యపరచడం ఖాయమని చెప్పిన దేవిశ్రీ.. తనదైన నటనతో ప్రేక్షకుల్లో మరింత ఎక్సైట్మెంట్ తెప్పిస్తాడని అన్నాడు. సుకుమార్ ప్రతి సీన్ను ఎంతో ఇంటెన్సిటీతో తెరకెక్కిస్తున్నారని చెప్పాడు. ఇంటర్వెల్కు ముందు వచ్చే సీన్ ఆడియెన్స్ను థ్రిల్ చేస్తుందన్నాడు. ముఖ్యంగా గంగమ్మ తల్లి అవతారంలో బన్నీ కనిపించే తీరు హైలైట్గా ఉంటుందంటూ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాడు.
ఈ సీక్వెల్లో శ్రీవల్లి పాత్రలో రష్మిక, అనసూయ, సునీల్, ఫహద్ ఫాజిల్ నటన కూడా నెక్స్ట్ లెవల్లో ఉంటుందని తెలుస్తోంది. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న వరల్డ్ వైడ్గా విడుదల కానుంది.