ప్రేమ కోసం మతం మార్చుకున్న అమ్మాయి

ప్రేమ కోసం మతం మార్చుకున్న అమ్మాయి

ప్రేమ కోసం మతం మార్పిడి చేసుకుంది ఓ అమ్మాయి. ముస్లీం అబ్బాయిని ప్రేమించిన ఆ అమ్మాయి పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకుంది. ఈ విషయం తెలిసిన ఆమె తల్లిదండ్రులు తమ కూతురిని ట్రాప్ చేశారని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది.

పంజాగుట్ట ఏసీపీ తిరుపతన్న చెప్పిన వివరాల ప్రకారం. ‘మంచిర్యాలకి చెందిన ఇందిరా అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని మతమార్పిడి చేసుకుని  కరీంనగర్ కు చెందిన  రిజ్వాన్ అనే వ్యక్తిని 2018 జులై లో  పెళ్లి చేసుకుంది.  రిజ్వాన్ గచ్చిబౌలి జెన్ ప్యాక్ట్ లో ఉద్యోగం చేస్తున్నాడు.  అమ్మాయి కూకట్ పల్లిలోని ఓ హాస్టల్ లో ఉంటుంది. కరీంనగర్ వివేకానంద కాలేజ్ లో ఇంజినీరింగ్ కాలేజ్ లో ఇద్దరి కలిసి చదువుకున్నారు. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి వ్యవహారం గత వారం రోజులు క్రితం ఆ అమ్మాయి తల్లిదండ్రులకు తెలిసింది. తమ కుతూరుని ట్రాప్ చేసి బలవంతంగా మత మార్పిడి చేశారని ఆరోపిస్తూ  పోలీసులను ఆశ్రయించారు.  కానీ అమ్మాయి ఇష్టపూర్వకంగానే మతమార్పిడి చేసుకుని రిజ్వాన్ ను పెళ్లి చేసుకున్నట్లు లిఖిత పూర్వకంగా  రాసి ఇచ్చింది. ఇంకా ఏవైనా అనుమానాలు ఉంటే ఫిర్యాదు చేస్తే విచారణ చేస్తామని‘ చెప్పారు.