‘ప్రాజెక్ట్ కె’ కోసం ఆనంద్ మహింద్రా సాయం కోరిన నాగ్ అశ్విన్

‘ప్రాజెక్ట్ కె’ కోసం ఆనంద్ మహింద్రా సాయం కోరిన నాగ్ అశ్విన్
  • దేశం గర్వించే సినిమాను తెరకెక్కిస్తున్నాం : డైరెక్టర్ నాగ్ అశ్విన్

బాహుబలి ప్రభాస్ మూవీకి ఆనంద్ మహింద్రా సాయం కోరాడు క్రేజీ డైరెక్టర్ నాగ్ అశ్విన్. వైజయంతి మూవీస్ బ్యానర్ లో ప్రభాస్ హీరోగా ‘ప్రాజెక్ట్ కె’ అనే పాన్ ఇండియా సినిమా తెరకెక్కుస్తున్నాడు నాగ్ అశ్విన్. బిగ్‌బి అమితాబ్‌, దీపికా పదుకొనె ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీకి సాంకేతిక సాయం కావాలని ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహింద్రాను కోరాడు నాగ్ అశ్విన్. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. ‘డియర్ మహింద్రా సర్... ఎన్నో విషయాల్లో మీరు నాకు ప్రేరణగా నిలిచారు. అమితాబ్ బచ్చన్, ప్రభాస్, దీపికా పదుకొనె తదితరులతో ‘ప్రాజెక్ట్ కె’ అనే  ఓ భారీ సైన్స్ ఫిక్షన్ మూవీని తెరకెక్కిస్తున్నాం. ఈ సినిమా కోసం ప్రస్తుత టెక్నాలజీని మించేలా.. ప్రత్యేకమైన, ఆధునాతన వాహనాలను రూపొందిస్తున్నాం. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే.. ఈ సినిమా మనదేశానికి గర్వకారణంగా నిలుస్తుంది. ఈ సినిమా కోసం చాలామంది టాలెంటెడ్ ఇండియన్ ఇంజినీర్స్ పని చేస్తున్నారు. అయితే ఇంత పెద్ద సినిమాకు మీ సాయం కావాలి. ఈ ప్రతిష్ఠాత్మక ఫిల్మ్ కోసం మీ నుంచి సాంకేతిక సాయం కోరుతున్నాం’ అని నాగ్ అశ్విన్ తెలిపాడు.

మరిన్ని వార్తల కోసం:

భారత్కు పాక్ కోర్టు డెడ్లైన్

వీఐపీ దర్శనాలు తగ్గించి.. సామాన్యులకు ప్రయారిటీ