కాళేశ్వరంతో వేల కోట్ల అవినీతి : నాగం జనార్దన్ రెడ్డి

కాళేశ్వరంతో వేల కోట్ల అవినీతి : నాగం జనార్దన్ రెడ్డి

రాష్ట్ర ప్రజల సొమ్మును సీఎం కేసీఆర్ అక్రమంగా దోచుకుంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు. ప్రజలు ఇండ్లు కట్టుకోవాలన్నా, వెంచర్ ఏర్పాటు చేయాలన్నా ఎమ్మెల్యే పర్మిషన్ కావాలనడం విచారకరమన్నారు.

వచ్చే ఎన్నికల్లో పార్టీ తనకు అవకాశం ఇస్తే పోటీ చేస్తానని నాగం వ్యాఖ్యానించారు. లేదంటే పార్టీ ఎవరిని నిలబెట్టినా మద్దతిస్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని నాగం జనార్దన్ రెడ్డి అన్నారు.