ఆగస్టు 15 వరకు భూ సమస్యల పరిష్కారం : కలెక్టర్  బదావత్  సంతోష్

ఆగస్టు 15 వరకు భూ సమస్యల పరిష్కారం : కలెక్టర్  బదావత్  సంతోష్

నాగర్​కర్నూల్, వెలుగు: భూ సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న భూభారతి రెవెన్యూ సదస్సులు పూర్తయ్యాయని కలెక్టర్  బదావత్  సంతోష్  తెలిపారు. శుక్రవారం బిజినేపల్లి మండలం వెలుగొండ గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సును పరిశీలించి, రైతులతో మాట్లాడారు. పంద్రాగస్టు వరకు భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. దరఖాస్తులను వెంటనే వెబ్​సైట్​లో అప్​లోడ్  చేయాలని ఆదేశించారు. అనంతరం బిజినేపల్లి మండలం అల్లీపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పనులను పరిశీలించారు.

ఇందిరమ్మ ఇండ్లను నాణ్యతతో కట్టుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇండ్లు వస్తాయని భరోసా ఇచ్చారు. వెలుగొండ గ్రామంలో అంగన్​వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. రేషన్​షాప్​ను తనిఖీ చేసి, మూడు నెలల బియ్యం పంపిణీని పరిశీలించారు. బిజినేపల్లి పీహెచ్​సీని విజిట్​ చేశారు. స్టాక్​ వివరాలు, వైద్యుల హాజరు, సిబ్బంది పనితీరును ఆరా తీశారు. బిజినేపల్లి తహసీల్దార్  మునూరోద్దీన్  ఉన్నారు.

భూ సమస్యల పరిష్కారం కోసమే భూభారతి..

మక్తల్, వెలుగు: భూ సమస్యల పరిష్కారం కోసమే భూభారతిని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని నారాయణపేట కలెక్టర్  సిక్తా పట్నాయక్  తెలిపారు. శుక్రవారం మక్తల్, కృష్ణ, మాగనూర్  మండలాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులను సందర్శించి ధరఖాస్తుల స్వీకరణను పరిశీలించారు. అనంతరం కృష్ణ తహసీల్దార్​ ఆఫీస్, కేజీబీవీని​తనిఖీ చేశారు. స్టూడెంట్స్ కు మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకొని రావాలని తెలిపారు.