పోక్సో కేసులో 21 ఏండ్ల జైలు..నల్గొండ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు సంచలన తీర్పు

పోక్సో కేసులో  21 ఏండ్ల జైలు..నల్గొండ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు సంచలన తీర్పు

నల్గొండ అర్బన్, వెలుగు : పోక్సో కేసులో నిందితుడికి 21 ఏండ్ల జైలుశిక్ష, రూ. 30 వేల జరిమానా విధిస్తూ నల్గొండ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి రోజా రమణి సోమవారం సంచలన తీర్పు ఇచ్చారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చిట్యాల మండలం వనిపాకల గ్రామానికి చెందిన దోమల రాములు, అదే గ్రామానికి చెందిన ఎనిమిదేండ్ల బాలిక ఇంట్లోకి వెళ్లి బెదిరించి, లైంగిక దాడికి పాల్పడ్డాడు.

2018, ఫిబ్రవరి11న బాధితురాలి తండ్రి చిట్యాల పోలీసులకు ఫిర్యాదు చేయగా అట్రాసిటీ, పోక్సో కేసులు  నమోదు చేశారు. అనంతరం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. వాదనల తర్వాత నిందితుడికి జైలుశిక్ష, జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. అదేవిధంగా బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. కేసులో సరైన సాక్ష్యాధారాలను సేకరించి నిందితుడికి శిక్ష పడేలా వ్యవహరించిన పోలీసులను ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు.

మెదక్ జిల్లాలో నిందితుడికి 20 ఏండ్ల జైలు 

మెదక్​ టౌన్ : మైనర్ పై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి 20 ఏండ్ల జైలుశిక్ష, రూ.5 వేలు జరిమానా విధిస్తూ మెదక్​జిల్లా కోర్టు జడ్జి నీలిమ తీర్పు ఇచ్చారు. ఎస్పీ డీవీ శ్రీనివాస్​రావు తెలిపిన ప్రకారం.. పెద్దశంకరంపేట మండలానికి చెందిన ఏడేండ్ల బాలికపై తలారి మోహన్​2022లో లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధిత కుటుంబం ఫిర్యాదుతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి పోక్సో కేసు నమోదు చేశారు. కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. వాదనల అనంతరం నిందితుడికి జైలుశిక్ష, జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. అదేవిధంగా బాధిత కుటుంబానికి రూ.3 లక్షల పరిహారం చెల్లించాలనే ఆదేశించారు.