యాదాద్రి, వెలుగు: స్కూల్కు వెళ్లిన అన్నను తీసుకురావడానికి అమ్మతో కలిసి వెళ్లిన చిన్నారి బస్సు కింద పడి చనిపోయిన ఘటన యాదాద్రి జిల్లాలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. భువనగిరి మండలం వడపర్తికి చెందిన శ్రీనివాస్– లతశ్రీ దంపతులకు ఇద్దరు కొడుకులు. పెద్దకొడుకు మోక్షిత్పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఫస్ట్క్లాస్చదువుతున్నాడు. స్కూల్కు వెళ్లిన మోక్షిత్ను తీసుకొచ్చేందుకు లతశ్రీ చిన్నకొడుకు నిశాంత్(2)ను తీసుకొని బస్సు వద్దకు వెళ్లింది. నిశాంత్ఆడుకుంటూ బస్సు వెనుక వైపు వెళ్లగా ఎవరూ గమనించలేదు. డ్రైవర్బస్సును వెనక్కి తీయడంతో వెనుక టైరు కిందపడి నిశాంత్ చనిపోయాడు. చిన్నారి మృతితో తల్లి గుండెలవిసేలా రోధించింది. తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
