బిగ్బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్కు బెయిల్

బిగ్బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్కు బెయిల్

బిగ్బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్కు ఎట్టకేలకు బెయిల్ వచ్చింది. షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. రూ. 15 వేల జరిమానా, ఇద్దరు పూచీకత్తులో పల్లవి ప్రశాంత్ కు బెయిల్ ఇచ్చింది. బిగ్ బాస్ విన్నర్ ను ప్రకటించిన రోజు జూబ్లీ హిల్స్ లోని అన్నపూర్ణ  స్టూడియోస్ వద్ద అనుమతి ర్యాలీ, బస్సులపై దాడి కేసులో పోలీసులు పల్లవి ప్రశాంత్ తో సహా అతని అనుచరులపై కేసు నమోదు చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. ఈ కేసులో A1గా పల్లవి ప్రశాంత్  ను రెండు రోజుల క్రితం అరెస్ట్ చేశారు పోలీసులు. 

బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ ప్రకటన తర్వాత ఆదివారం (డిసెంబర్ 17)  అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర పల్లవి ప్రశాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రన్నరప్ అమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అభిమానుల మధ్య గొడవ జరిగింది. రెండు వర్గాలు రెచ్చిపోయి కొట్టుకున్నారు. ఆరు సిటీ ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు.  బస్సు అద్దాలు పగులగొట్టారు. బందోబస్తు కోసం వచ్చిన పంజాగుట్ట పోలీస్ వెహికల్ తో పాటు బెటాలియన్ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. జూబ్లీహిల్స్ చెక్​పోస్టు దగ్గర హంగామా సృష్టించారు. రెండు వర్గాల రాళ్ల దాడిలో పలు కార్ల అద్దాలు పగిలిపోయాయి. రన్నరప్​గా నిలిచిన అమర్ దీప్ కారుపై పల్లవి ప్రశాంత్ అభిమానులు దాడి చేశారు. 

ఈ అల్లర్లపై బిగ్​బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్​పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైంది. పల్లవి ప్రశాంత్ పై  147, 148, 290, 353, 427 r/w 149 IPC సెక్షన్ 3 PDPP యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. పల్లవి  ప్రశాంత్ని A-1 గా, అతని సోదరుడు మనోహర్ ను A2గా, A-3గా ఫ్రెండ్ వినయ్ని చేర్చారు. ఈ క్రమంలోనే పోలీసులు పల్లవి ప్రశాంత్.. అలియాస్ రైతు బిడ్డను అరెస్ట్ చేశారు.