సీఎం రేవంత్ రెడ్డితో జూ. ఎన్టీఆర్ సోదరి సుహాసిని భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో జూ. ఎన్టీఆర్ సోదరి సుహాసిని భేటీ

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని భేటీ అయ్యారు. మార్చి 30వ తేదీ ఉదయం జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా సమావేశం అయ్యారు. సుహాసిని హీరో కళ్యాణ్ రాం, జూనియర్ ఎన్టీఆర్ సోదరి అనేది తెలిసిన విషయమే. 

సీఎం రేవంత్ రెడ్డితో సుహాసిని సమావేశం అయిన సమయంలో.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ, మంత్రి కొండా సురేఖ, పట్నం మహీందర్ రెడ్డి కూడా ఉన్నారు. పొలిటికల్ హీట్.. ఎంపీ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఈ భేటీ జరగటం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తుంది.

గతంలో కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు సుహాసిని. ప్రస్తుతం తెలంగాణ టీడీపీ పార్టీ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు సుహాసిని. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం కావటం ఆసక్తిగా మారింది. భేటీ అనేది మర్యాదపూర్వకంగానే అనేది సమాచారం.