మంత్రి గంగుల కమలాకర్కు తృటిలో ప్రమాదం తప్పింది. కరీంనగర్ జిల్లా చెర్లబూట్కూర్లో ఏర్పాటు చేసిన సభావేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో మంత్రి గంగుల కమలాకర్ సహా ఇతర బీఆర్ఎస్ నేతలు కిందపడ్డారు. ఈ ప్రమాదంలో మంత్రి గంగులకు చిన్న గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో కరీంనగర్ జెడ్పిటీసీ సభ్యుని కాలు విరగడంతో ఆయన్ను హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. వేదికపైకి పరిమితికి మించి సభ్యులు రావడంతోనే కుప్పకూలినట్లు తెలుస్తుంది.
చిన్నగాయమే..
సభా వేదిక కూలడంపై మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. తనకు చిన్న గాయమే అయిందన్నారు. ప్రాథమిక చికిత్స కూడా చేశారని...విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.