మరో డ్రగ్స్ వ్యవహారం..రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న పోలీసులు

మరో డ్రగ్స్ వ్యవహారం..రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న పోలీసులు

రంగారెడ్డి జిల్లాలో విచ్చలవిడిగా డ్రగ్స్ దందా కొనసాగుతోంది. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని నార్సింగిలో డ్రగ్స్ తీసుకుంటుండగా ఓ విద్యార్థిని పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అతని నుంచి 5 గ్రాముల డ్రగ్స్, 14 ఇన్సులిన్ సిరెంజస్, ఓ వెయింగ్ మిషన్ తో పాటు 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని గన్నవరానికి చెందిన సాకేత్ గా పోలీసులు గుర్తించారు.

సాకేత్ బెంగళూరులో డ్రగ్స్ కొనుగోలు చేసి, వాటిని రాజేంద్రనగర్ ప్రాంతంలో విక్రయించడానికి వచ్చాడని పోలీసులు తెలిపారు. నిందితుడిపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాకేత్ డ్రగ్స్ ఎవరికి విక్రయించడానికి వచ్చాడు? బెంగుళూరులో అతనికి డ్రగ్స్ ఎవరు అమ్మారు అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.