కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నం : దుండ్ర కుమారస్వామి

కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నం : దుండ్ర కుమారస్వామి
  • జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి

బషీర్ బాగ్, వెలుగు : బీసీలకు అండగా ఉంటున్న కాంగ్రెస్ కు లోక్ సభ ఎన్నికల్లో తమ సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని, ఆ పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేస్తామని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తెలిపారు.  జాతీయ బీసీ దళ్, అనుబంధ సంఘాలు, వివిధ విభాగాలు నేతలు ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుడు  వేం నరేందర్ రెడ్డిని బుధవారం హైదరాబాద్ లో కలిసి మద్దతు ప్రకటిస్తూ లేఖను అందజేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోపే బీసీ కులాలకు 17 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత దక్కిందన్నారు. హామీ మేరకు సామాజిక ఆర్థిక కుల గణనకు నిర్ణయం తీసుకోవడం,  కులగణనకు ఉత్తర్వులు జారీ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. దీంతో బీసీలకు అండగా ఉంటున్న కాంగ్రెస్ కు మద్దతు ఇస్తూ..

త్వరలో 17 లోక్ సభ సెగ్మెంట్లవారీగా తమ అనుబంధ సంఘాల ప్రతినిధులు, బీసీలను సమన్వయం చేసి సమావేశాలు ఏర్పాటుచేసి, అభ్యర్థుల గెలుపునకు  కృషి చేస్తామన్నారు. గాంధీ నారాయణ, సింహాద్రి, వెంకటరమణ, రాజారాం,విద్యార్థి విభాగం సాయి యాదవ్, మహిళా విభాగం, కార్మిక విభాగం అధ్యక్షులతో పాటు వివిధ కుల సంఘాల చెందిన ప్రతినిధులు ఉన్నారు.