
వెంకటాపురం : భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ-ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ములుగు జిల్లా వాజేడు మండలంలోని టేకులగూడెం గ్రామం వద్ద హైదరాబాద్ టూ భూపాలపల్లి 163 నేషల్ హైవే పైకి గోదావరి వరద నీరు చేరడంతో ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఇరు రాష్ట్రాలకు రాకపోకలను నిలిపివేశారు.
భారీ వర్షాల నేపపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకి రావొద్దని అధికారులు హెచ్చరించారు. పోలీసులు రోడ్డుపై భారీ కేడ్లు ఏర్పాటు చేశారు. పేరూరు గ్రామం వద్ద ఇవాళ తెల్లవారుజామున గోదావరి వరద స్వల్పంగా తగ్గింది