పోలీసులపై సిద్ధూ వివాదాస్పద వ్యాఖ్యలు

పోలీసులపై సిద్ధూ వివాదాస్పద వ్యాఖ్యలు

చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవోజోత్ సింగ్ సిద్ధూ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. పార్టీ ఎమ్మెల్యేలను ప్రశంసించే క్రమంలో పోలీసులపై సిద్ధూ చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీగా మారాయి. తమ పార్టీ ఎమ్మెల్యేలు తలచుకుంటే పోలీసుల ప్యాంట్లు తడిచిపోయేలా చేయగలరని సిద్ధూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు ఆయనపై పరువు నష్టం దావా వేశారు. అసలేం జరిగిందంటే.. రీసెంట్గా సుల్తాన్ పూర్ లోధిలో జరిగిన పార్టీ ప్రచార సభలో సిద్ధూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన.. సిట్టింగ్ ఎమ్మెల్యే నవతేజ్ సింగ్ చీమాను ప్రశంసించారు. ఎమ్మెల్యేలు తమ అధికార బలంతో పోలీసుల ప్యాంట్లు తడిచేలా చేయగలరని కామెంట్ చేశారు. మరో సభలో కూడా ఆయన ఇలాంటి వ్యాఖ్యలే చేయడం గమనార్హం.

సిద్ధూ వ్యాఖ్యలపై పోలీసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ నాయకుడైన సిద్ధూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పోలీసులను అవమానించడం సిగ్గుచేటని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చండీగఢ్ డీఎస్పీ దిల్షేర్ సింగ్ చందేల్ అన్నారు. పోలీసుల భద్రతే లేకపోతే.. సిద్ధూ మాటలను రిక్షా లాక్కొనే వ్యక్తి కూడా పట్టించుకోడని దిల్షేర్ చెప్పారు. ఆయనకు పరువు నష్టం నోటీసులు పంపించినట్లు తెలిపారు. 

మరిన్ని వార్తల కోసం: 

8 ఏళ్ల బాలుడికి ఒమిక్రాన్ పాజిటివ్

మోడీ కాన్వాయ్లో రూ.12 కోట్లతో కొత్త కారు

కాంగ్రెస్ జెండా ఎగరేస్తుండగా.. ఊడి సోనియా చేతిలోకి