మోడీ కాన్వాయ్లో రూ.12 కోట్లతో కొత్త కారు

మోడీ కాన్వాయ్లో రూ.12 కోట్లతో కొత్త కారు

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ కాన్వాయ్ లో ఓ ఖరీదైన కారు చేరింది. దీని పేరు మెర్సిడెజ్ మేబ్యాచ్ ఎస్650. ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దేశ రాజధానికి వచ్చినప్పుడు ఆయనకు స్వాగతం పలికేందుకు హైదరాబాద్ హౌస్ కు వచ్చిన మోడీ.. తొలిసారి ఈ కారులో కనిపించారు. ఈ మధ్య మోడీ కాన్వాయ్ లో మరో కొత్త వాహనం కనిపిస్తోంది. అదే మెర్సిడెజ్ ఎస్ 650. ఈ మోడల్ ను మెర్సిడెజ్ సంస్థ 2019లోనే విడుదల చేసింది. 

అత్యున్నత భద్రతా ప్రమాణాలు కలిగిన మెర్సిడెజ్ ఎస్ 650 విలువ రూ.12 కోట్లకు పైనే ఉంటుందని తెలుస్తోంది. ఇది బుల్లెట్ ప్రూఫ్ కారు. బాంబు పేలుళ్ల నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది. దీని భద్రతా స్థాయి వీఆర్ 10. అంటే అత్యున్నత భద్రతా స్థాయి అని అర్థం చేసుకోవచ్చు. విష వాయువు దాడుల నుంచి సేఫ్టీ కోసం దీంట్లోకి ఎప్పుడూ తాజా గాలి వస్తుంది. ఫ్యుయల్ ట్యాంకుకు ఓ ప్రత్యేకమైన పదార్థంతో పూత పూస్తారు. ట్యాంకుకు ఎప్పుడు రంధ్రం పడినా ఈ పదార్థం వల్ల దానికి అదే ఊడిపోతుంది. కాగా, కాన్వాయ్ లో ఏ వాహనం ఉండాలనేది ప్రధానికి భద్రత కల్పించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) నిర్ణయిస్తుంది.  

మరిన్ని వార్తల కోసం: 

కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం.. పైకి ఎగరని జెండా

ఈ మెషిన్​​ నుంచి కథలు వస్తయ్

బీసీసీఐ చీఫ్ దాదాకు కరోనా