మైసూర్ లో నాగ చైతన్య కొత్త మూవీ షూటింగ్

మైసూర్ లో నాగ చైతన్య కొత్త మూవీ షూటింగ్

అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న లెటెస్ట్ ఫిల్మ్ ‘NC22’ కీలక షెడ్యూల్ పూర్తి  చేసుకుంది. క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ మైసూర్ లో కొనసాగుతోంది. తాజాగా కీలక షెడ్యూల్ కంప్లీట్ చేసినట్లు శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ షెడ్యూల్‌లో నాగ చైతన్యకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. మైసూర్‌లోని సుందరమైన లొకేషన్లలో షెడ్యూల్‌ను పూర్తి చేసింది. తెలుగు, తమిళం భాషల్లో రూపొందుతున్న ఈ ఫిల్మ్ కు 'NC22' పేరు పెట్టారు. ‘నాగ చైతన్య’ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. నాగ చైతన్య కెరీర్ లో భారీ బడ్జెట్ గా చిత్రం తెరకెక్కబోతోంది.

శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దిగ్గజ సంగీత దర్శకులైన  ఇళయరాజా ఆయన కొడుకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబర్ 21న హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్‌లలో చిత్రీకరణ ప్రారంభమైంది. గత కొద్దిరోజులుగా ఈ చిత్రం నుండి మేకర్స్ వరుసగా అప్ డేట్స్ ఇస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న సినిమాలో ప్రియమణీ, వెర్సటైల్ యాక్టర్ సంపత్ రాజ్ లు కీలక పాత్రలు పోషిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవలే ప్రకటించింది. అలాగే బుల్లి తెరపై సంచలనం సృష్టించిన ‘కార్తీక దీపం’ ఫేమ్ ‘దీప అలియాస్ వంటలక్క ఈ సినిమాలో కీలక పాత్ర పోషించనున్నారు.