తిమ్మాపూర్, వెలుగు: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని జ్యోతిష్మతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అటానమస్ కాలేజీలో జూన్ 3 నుంచి 12వరకు ఎన్సీసీ కంబైన్డ్ యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్-–2ను నిర్వహిస్తున్నట్లు కాలేజీ చైర్మన్ జువ్వాడి సాగర్రావు తెలిపారు. కల్నల్ పీఎస్ సింగ్, గ్రూప్ కమాండర్ నిజామాబాద్, కల్నల్ ఏకే జయంత, కమాండింగ్ ఆఫీసర్ 9వ తెలంగాణ బెటాలియన్ కరీంనగర్, లెఫ్టినెంట్ కల్నల్ వి.కృష్ణ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, 9వ తెలంగాణ బెటాలియన్ కరీంనగర్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ కొనసాగుతున్నట్లు చెప్పారు.
శిక్షణకు హాజరయ్యే అతిథులు, ఎన్సీసీ అధికారులు, క్యాడెట్లకు విద్యాసంస్థ తరఫున ఘనస్వాగతం పలికారు. జ్యోతిష్మతి సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ జె.సుమిత్ సాయి, ప్రిన్సిపాల్ టి.అనిల్ కుమార్, డీన్ అకడమిక్స్ అండ్ఆడిట్ పీకే వైశాలి క్యాంప్ నిర్వహణపై హర్షం వ్యక్తంచేశారు.
