మోడీ ద్విముఖ వ్యూహం: వర్తకం మొదలవ్వాలి… కరోనా ఆగాలి

మోడీ ద్విముఖ వ్యూహం: వర్తకం మొదలవ్వాలి… కరోనా ఆగాలి

కరోనా( కోవిడ్ – 19 ) పై పోరులో భారత్ ద్విముఖ వ్యూహాంపై దృష్టి సారించిందని అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. సోమవారం ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫిరెన్స్‌లో మాట్లాడిన ఆయన… కరోనాను నిర్మూలిస్తూనే పౌరుల సేఫ్టీకి అంకితమవుతూ ఆర్థిక కార్యకలాపాలను ప్రారంభిస్తామని చెప్పారు.

కరోనా వ్యాపించిన రెడ్ జోన్లను ఆరెండ్ జోన్లుగా చివరికి గ్రీన్ జోన్లుగా మార్చేందుకు కృషిచేస్తున్నామని తెలిపారు మోడీ.   గ్రీన్ జోన్లు ఆర్థిక కార్యకలాపాలు జరపడానికి ఉపయోగపడతాయని అయితే అక్కడ కూడా భౌతిక దూరం పాటించాలని తెలిపారు. దేశంలో పలు జిల్లాలు గ్రీన్ జోన్లుగా ఉన్నాయని అయితే వాటిని ఆర్థిక అవసరాలకు ఉపయేగపడేలా ఎలా మలచవచ్చో తాము త్వరలో తెలుపుతామని అన్నారు. ఏప్రిల్ మధ్యలో ప్రభుత్వ అంచనా ప్రకారం.. 20రాష్ట్రాలలో 170 జిల్లాలు, ఐదు కేంద్ర ప్రాంత ప్రాంతాలు రెడ్ జోన్ లుగా గుర్తిచబడ్డాయని ఆయన అన్నారు. 207జిల్లాలు ఆరేంజ్ జోన్లు, 730 జిల్లాలు గ్రీన్ జోన్ లో ఉన్నాయని చెప్పారు.

రెండ్ జోన్లు, ఆరెంజ్ జోన్లపై ప్రత్యేక దృష్టి ఉంచాలని వాటికోసం తాము ప్రత్యేక బృందాలను తయారు చేస్తున్నామని మోడీ చెప్పారు. ఈ మీటింగ్ లో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ కొనసాగించాలని కోరాయి. అయితే తుది నిర్ణయాన్ని ప్రధాన మంత్రికే వదిలిపెట్టినట్లు పీఎంఓ అధికారులు తెలిపారు.

అంటువ్యాదుల సంఖ్య ఆదారంగా రాష్ట్రాలపై తాము వివక్ష చూపమని  చెప్పారు ప్రధాని మోడీ. తక్కువ కోవిడ్ కేసులు ఉన్న రాష్ట్రాన్ని గొప్పగా, ఎక్కువ కేసులు ఉన్న రాష్ట్రాన్ని  తక్కువగా చూడనని తెలిపారు. కోవిడ్ -19 వ్యాప్తి ఉన్నప్పటికీ సాధారణ, కాలానుగుణ వ్యాధుల నివారణకు ఆరోగ్య రంగాలను సిద్దం చేయాలని సీఎంలను దిశానిర్ధేశం చేశారు మోడీ.