నెల్లూరు: పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయనపై శనివారం వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లో నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. ఇవాళ్టి నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించిన శ్రీధర్ రెడ్డి నెల్లూరు వైసీపీ ఆఫీస్ ముందు దీక్షకు దిగారు. అక్రమ కేసులను ప్రశ్నించినందుకు వైసీపీ నేతలపైనే ఏపీ పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని ఆ పార్టీ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
సర్వేల పేరుతో ఓట్లు తొలగిస్తున్న వారిని YSRCP పోలీసులకు పట్టించింది. ఐతే YCP కార్యకర్తలపైనే పోలీసులు అక్రమంగా కేసు నమోదు చేశారు. పోలీసుల తీరుపై కోటంరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. ఆయనను అరెస్ట్ చేశారు. జిల్లా కోర్టులో హాజరుపరచగా జడ్జి మార్చి- 23 వరకు రిమాండ్ విధించారు. వైద్యపరీక్షలు పూర్తైన తర్వాత కోటంరెడ్డిని సెంట్రల్ జైలుకు తరలించారు.