లేడీ ఓరియెంటెడ్ మూవీలో శియా గౌతమ్ 

లేడీ ఓరియెంటెడ్ మూవీలో శియా గౌతమ్ 

'నేనింతే' బ్యూటీ శియా గౌతమ్ హీరోయిన్ గా ఒ లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటించబోతోంది. ఈ సినిమాకు 'మరో మహాభారతం' టైటిల్ ను ఖరారు చేశారు మేకర్స్. ఈ సినిమా దసరా రోజున పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. కేఎల్ఎన్ క్రియేషన్స్ క్రియేటివ్ క్యారెక్టర్స్ సమర్పణలో ప్రొడక్షన్ నెంబర్ 1గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. 

జగదీష్ దూగాన దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని లక్ష్మీ నారాయణ కిల్లి, రామకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ మొదటివారం నుండి ప్రారంభం కానుంది. అక్టోబర్ 5న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేయనున్నారు.