ఈ మధ్య భర్తల వేధింపులకు భార్య ఆత్మహత్య ఘటనల కంటే భార్య వేధింపులకు భర్త ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలే రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయి. మార్చి 12న హైదరాబాద్ సిటీలో ఓ మహిళా పోలీస్ అధికారి వేధింపులు తట్టుకోలేక తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.
హైదరాబాద్ నేరెడ్ మెట్ లో భార్య వేధింపులు తట్టుకోలేక ఎక్సైజ్ సీఐ జ్యోతి భర్త ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. జ్యోతి వేధింపులు తాళ లేక ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఆమె భర్త శ్రీనివాస్ సూసైడ్ లేఖ రాశారు.
సీఐగా ప్రమోషన్ పొందినప్పటి నుంచి తన దగ్గరికి రావడం లేదని తనపై కట్నం వేధింపులతో పాటు విడాకుల కోసం దరఖాస్తు చేసుకుందని సూసైడ్ నోట్ లో తెలిపారు శ్రీనివాస్. పోలీస్ స్టేషన్ కి పిలిపించి తనను బెదిరింపులకు పాల్పడేదని ఆరోపించారు. వేధింపుల తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ లో ఆరోపించారు.
