
ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో హమాస్ గాజా చీఫ్ కమాండర్ మహ్మద్ సిన్వర్ హతమయ్యాడని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు బుధవారం (మే28)న ధృవీకరించారు.
పార్లమెంటులో మాట్లాడిన నెతన్యాహు యుద్ధభూమిలో ఇజ్రాయెల్ హతం చేసిన హమాస్ నాయకుల జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో హమాస్ చీఫ్ కమాండ్ సిన్వర్ పేరు కూడా ఉంది. సిన్వర్ హతమైనట్లు ఇజ్రాయెల్ ప్రకటించడం ఇదే మొదటిసారి.
ALSO READ | Trump News: అమెరికాలో భాగమైతే.. గోల్డెన్ డోమ్ ఫ్రీ, కెనడాకు ట్రంప్ ఆఫర్
2024 అక్టోబర్ 7 దాడులకు సూత్రధారి అయిన యాహ్యా సిన్వర్ను రఫాలో ఇజ్రాయెల్ దళాలు హతమార్చిన తర్వాత మహ్మద్ సిన్వర్ హమాస్ నాయకుడిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి మహ్మద్ సిన్వర్ చేతిలో 58 మంది ఇజ్రాయెల్ బందీలు ఉన్నారు. వీరిలో దాదాపు 21 మంది ఇప్పటికీ బతికే ఉన్నారని భావిస్తున్నారు.