ఎలక్టోరల్ బాండ్స్ స్వీకరించలే : సీపీఎం

ఎలక్టోరల్ బాండ్స్ స్వీకరించలే : సీపీఎం

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గతంలో తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్​ స్కీమ్​కు తాము వ్యతిరేకమని, మొదటి నుంచీ దీనిని వ్యతిరేకించామని సీపీఎం శుక్రవారం తెలిపింది. అందుకే అప్పట్లోనే దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు వెల్లడించింది.

ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా తాము విరాళాలు సేకరించలేదని, ఇదే విషయంపై గతంలోనూ క్లారిటీ ఇచ్చామని ఓ ప్రకటనలో తెలిపింది. ఇలా బాండ్స్ ద్వారా విరాళాలు సేకరించాలంటే ఎస్బీఐలో ప్రత్యేకంగా ఖాతా తెరవాల్సి ఉంటుందని, సీపీఎంకు అలాంటి ఖాతా ఏదీ తెరవలేదని తేల్చి చెప్పింది.