హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా కేసులు, మరణాల వెల్లడిలో ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవడం లేదు. సోమవారం మీడియా బులెటిన్ కూడా విడుదల చేయలేదు. రాత్రి 10 గంటల తర్వాత హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్ పీఆర్వో వాట్సాప్లో రిపోర్టర్లకు ఓ మెసేజ్ పెట్టారు. అందులో సోమవారం 92 కేసులు, 5 మరణాలు నమోదైనట్టు పేర్కొన్నారు. ఇతర వివరాలేమీ వెల్లడించలేదు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 3,742కు చేరాయి. మృతుల సంఖ్య142కు పెరిగింది.