రాష్ట్రంలో మరో 92 మందికి కరోనా.. ఐదుగురు మృతి

రాష్ట్రంలో మరో  92 మందికి కరోనా.. ఐదుగురు మృతి

హైదరాబాద్‌, వెలుగురాష్ట్రంలో కరోనా కేసులు, మరణాల వెల్లడిలో ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవడం లేదు. సోమవారం మీడియా బులెటిన్ కూడా విడుదల చేయలేదు. రాత్రి 10 గంటల తర్వాత హెల్త్​ మినిస్టర్​ ఈటల రాజేందర్ పీఆర్వో వాట్సాప్‌లో రిపోర్టర్లకు ఓ మెసేజ్‌ పెట్టారు. అందులో సోమవారం 92 కేసులు, 5 మరణాలు నమోదైనట్టు పేర్కొన్నారు. ఇతర వివరాలేమీ వెల్లడించలేదు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 3,742కు చేరాయి. మృతుల సంఖ్య142కు పెరిగింది.

ఏడజూసినా కరోనానే..