హైదరాబాద్, వెలుగు: క్రైమ్ సీన్లో నేరస్థులను గుర్తించేందుకు సీఐడీ చీఫ్ మహేశ్ భగవత్ ఫింగర్ప్రింట్స్బ్యూరోకు కొత్త పరికరాలు అందజేశారు. కొత్తగా రూ.1.33కోట్ల కిట్లను రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ కొనుగోలు చేయగా, బుధవారం పంపిణీ చేశారు.
సిటీ కమిషనరేట్పరిధిలోని నాలుగు జోన్లు, రాచకొండ కమిషనరేట్లోని ఎల్బీనగర్, సైబరాబాద్లోని శంషాబాద్ జోన్ల ఫింగర్ ప్రింట్స్ బ్యూరో సిబ్బందికి అందించారు. ఈ కిట్లలో పౌడర్స్, బ్రషెస్, లిఫ్టింగ్ టేప్స్, ప్యాడ్స్, మాగ్నిఫైయింగ్ లెన్సులు, కత్తెరలు, మార్కర్స్తో కూడిన మాస్టర్ఎక్స్పర్ట్ లాటెంట్ప్రింట్ కిట్, ఫింగర్ ప్రింట్ కెమికల్ ప్రాసెసింగ్ కిట్కు సంబంధించిన అయోడిన్ ఫ్యూమింగ్, నైన్హైడ్రిన్ కిట్లు ఉన్నాయి. కార్యక్రమంలో ఫింగర్ ప్రింట్స్ బ్యూరో డైరెక్టర్ తాతారావు, బ్యూరో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.