హైదరాబాద్, వెలుగు: హైకోర్టు కొత్త జడ్జిలు మంగళవారం ఉదయం 10.45కు ప్రమాణస్వీకారం చేయనున్నారు. వాళ్లతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణం చేయిస్తారు. జడ్జిలుగా ఏనుగుల వెంకట వేణుగోపాల్, నగేష్ భీమపాక, పుల్లా కార్తీక్ (పి.ఎలమాధర్), కాజ శరత్, అడిషినల్ జడ్జిలుగా జగ్గన్నగారి శ్రీనివాసరావు, నామవరపు రాజేశ్వర్రావు బాధ్యతలు స్వీకరిస్తారు.
ఇప్పటిదాకా హైకోర్టులో 28 మంది జడ్జిలు ఉన్నారు. కొత్త వాళ్లతో కలిపితే ఈ సంఖ్య 34కు చేరుతుంది. హైకోర్టు ఏర్పాటైనప్పుడు జడ్జిల సంఖ్య 24. ఆ సంఖ్యను 42కు పెంచుతూ ఇటీవల కేంద్రం ఉత్తర్వులు ఇచ్చింది. ఆరుగురు కొత్త వారు ప్రమాణం చేశాక మరో 8 జడ్జి పోస్టులు ఖాళీగా ఉంటాయి.