
కొత్తగా మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ స్పందించారు. తాను జీవితంలో మర్చిపోలేని రోజన్నారు. మంత్రి వర్గంలో స్థానం దక్కడంతో సంతోషంగా ఉందన్నారు. తనకు మంత్రి పదవి కల్పించిన కాంగ్రెస్ అధిష్ఠానానాకి కృతఙ్ఞతలు తెలిపారు.
మంత్రివర్గ విస్తరణలో మాదిగ సామాజికవర్గంలో ఒకరికి చోటు కల్పించాలని వారు సీఎం రేవంత్ నిర్ణయం తీసుకోవడంతో అనుహ్యంగా అడ్లూరి లక్ష్మణ్ పేరు తెరపైకి వచ్చింది.
ధర్మపురి శాసనసభ నియోజకవర్గం నుంచి లక్ష్మణ్ కుమార్ తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009-2011 మధ్య కాలంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆయన పని చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్పై 22,039 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ప్రభుత్వ విప్గా నియమితులయ్యారు. తాజాగా.. మంత్రి వర్గంలో చోటు దక్కించుకోబోతున్నారు. ఇలా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా జాక్పాట్ దక్కించుకుంటున్నారు.