
హైదరాబాద్, వెలుగు: నుమాయిష్ ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన ఆర్అండ్బీ స్టాల్లో కొత్త సెక్రటేరియెట్ నమూనా, అమరవీరుల స్మారక స్తూపం, ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల మోడల్స్ను ప్రదర్శనకు ఉం చారు. మంగళవారం మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆ స్టాల్ను ప్రారంభించారు. ఆర్అండ్బీ కట్టిన, కడుతున్న పలు భవనాల నమూనాలను స్టాల్లో పెట్టారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఆర్అండ్బీ ఆధ్వర్యంలో చరిత్రాత్మక ఐకానిక్ కట్టడాలు రూపుదిద్దుకున్నాయన్నారు. తెలంగాణ వైభవం, గొప్పతనాన్ని చాటేలా నిర్మాణాలను చేపట్టామని చెప్పారు.
2014కు ముందు ఆర్అండ్బీ30 లక్షల స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణమున్న బిల్డింగులను కడితే.. తెలంగాణ వచ్చాక కోటి స్క్వేర్ ఫీట్ల నిర్మాణా లు చేపట్టిందన్నారు. వాటికి రూ.20 వేల కోట్లు ఖర్చు పెట్టామన్నారు. ప్రపంచంలోనే స్టెయిన్లెస్ స్టీల్తో కట్టిన గొప్ప కట్టడంగా అమరుల స్తూపం నిలుస్తుందన్నారు. షికాగో, దుబాయ్ తర్వాత అట్లాంటి నిర్మాణం హైదరాబాద్లోనే ఉందని మంత్రి చెప్పారు.