వీడియో: భారత్, న్యూజిలాండ్ మూడో T20లో విచిత్ర సంఘటన

వీడియో: భారత్, న్యూజిలాండ్ మూడో T20లో విచిత్ర సంఘటన

న్యూజిలాండ్ అభిమానితో ‘భారత్ మాతా కి జై’ అనిపించిన ఇండియన్స్

బుధవారం హామిల్టన్‌లోని సెడాన్ పార్క్‌లో భారత్, న్యూజిలాండ్‌ల మధ్య మూడో ట్వంటీ 20 ఇంటర్నేషనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ చివరి వరకు అభిమానుల్లో ఉత్కంఠను రేపింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్ చివరికి డ్రా అయింది. దాంతో రెండు జట్ల మధ్య సూపర్ ఓవర్‌ను పెట్టారు. ఆ సూపర్ ఓవర్‌‌లో న్యూజిలాండ్ ఇచ్చిన 17 పరుగుల లక్ష్యాన్ని చేధించి భారత్ సిరీస్‌ని సొంతం చేసుకుంది.

మ్యాచ్ ముగిసిన తరువాత ప్రేక్షకుల గ్యాలరీలో ఓ విచిత్రం చోటుచేసుకుంది. ఇండియా గెలిచిందన్న సంతోషంతో భారత అభిమానులు ‘భారత్ మాతా కి జై’ అని నినదించారు. ఆ అభిమానుల ముందు వరుసలో కూర్చొన్న న్యూజిలాండ్ అభిమానికి అది నచ్చిందో లేక విచిత్రంగా అనిపించిందో కానీ.. అతను కూడా ఇండియన్ ఫ్యాన్స్ నుంచి ఆ వ్యాఖ్యాన్ని అనుసరిస్తూ ‘భారత్ మాతా కి జై’ అని అతని స్టైల్లో అన్నాడు. మొదటగా అది అనుకరించబోయిన న్యూజిలాండ్ వ్యక్తికి సరిగా పలకడం రాలేదు. దాంతో మనోళ్లు ఊరుకుంటారా.. ఒక్కొక్క పదాన్ని చెబుతూ అతని చేత ‘భారత్ మాతా కి జై’అని అనిపించారు. 16 సెకన్ల నిడివి గల ఈ వీడియో ఇప్పడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

సూపర్ ఓవర్‌లో మ్యాచ్ భారత్ వశం కావడంతో అభిమానుల ఆనందానికి హద్దు లేకుండా పోయింది. అభిమానులు తమ నినాదాలతో స్టేడియాన్ని హోరెత్తించారు.

For More News..

మేకలమ్మితే రూ. 1.32 కోట్లు

వైరల్ వీడియో: జింకను గన్‌తో కాల్చి.. కత్తితో గొంతు కోసిన వ్యక్తి

కొన్నది 25 వేలకి.. అమ్మితే వచ్చేది 5 కోట్లు